శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeభక్తికేదార్‌నాథ్ స్థల పురాణం వినడమే అధృష్ణం..| Kedarnath yatra

కేదార్‌నాథ్ స్థల పురాణం వినడమే అధృష్ణం..| Kedarnath yatra

 ఈ Kedarnath మహా పుణ్య క్షేత్రాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వారికి  తప్పక మోక్షం కలుగుతుంది. “కేదార్‌నాథ్” అనే పేరుకు “క్షేత్ర ప్రభువు” అని అర్ధం వస్తుంది: ఇది కేదర (“క్షేత్రం”) మరియు నాథ (“ప్రభువు”) అనే రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది నామం.

“విముక్తి పంట” ఇక్కడ పెరుగుతుంది కాబట్టి దీనిని కేదార్‌నాథ్ అని పిలుస్తారని  కాశీ కేదర మహాత్మ్య వచనంలో పేర్కొనబడింది.

Kedarnath Yatra

Kedarnath temple history కేదార్‌నాథ్ భారతదేశంలో గల ఉత్తరాఖండ్‌ రాష్ట్రం లోని ఒక పట్టణం, కేదార్‌నాథ్ ఆలయం కారణంగానే ఇది చాలా  ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది రుద్రప్రయాగ్ జిల్లాలోని నగర్ పంచాయతీ. నాలుగు చోటా చార్ ధామ్ సైట్లలో అత్యంత మారుమూలమైన కేదార్‌నాథ్ ఇది హిమాలయాలలో సముద్ర మట్టానికి  సుమారు 3,583 మీ (11,755 అడుగులు) దూరంలో ఉంది.

ఈ ప్రాంతంలో మందాకిని నదికి మూలాధారమైన చోరాబరి హిమానీనదం సమీపంలో ఉన్న ఇది విపరీతమైన మంచుతో కప్పబడిన శిఖరాలతో, ముఖ్యంగా Kedarnath పర్వతం చుట్టూ ఉంది. సమీపంలోని రోడ్ హెడ్ గౌరికుండ్ వద్ద పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆలయ ప్రత్యేకత:

ఇది మొత్తం ’12 జ్యోతిర్లింగాల్లో ఈ ఆలయం ఒకటి. కేదార్‌నాథ్ ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం.  ఇది హిమాలయాల్లోని చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఆదిశంకరులు ఇక్కడ ఈశ్వరుని సాన్నిధ్యం చెందటం ఇక్కడి ప్రత్యేకత.  ఇక్కడ కేదారనాధుడు ఆరు నెలలు మనుషుల పూజలు అందుకుంటే ఇంకో ఆరు నెలలు దేవతల పూజలు అందుకుంటారని శాస్త్రాల్లో పేర్కొనబడింది.

Kedarnath స్థల పురాణం  గురించి తెలుసుకుందాం. మన జీవితంలో అసలు ఈ స్థల పురాణము వినడమే అత్యంత అధృష్ణం..  కేదార్‌నాథ్ హిందువుల యొక్క  ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఇదికూడా ఒకటి.

ఇది ఎవరికైనా ఎలాంటి వయస్సు వారికైనా  ఎంతటి వారికైనా ఈ నేపథ్యంలో కేదారేశ్వరుని శివలింగం గురించి వినే ప్రయత్నం చేయడం వలన మానవ శరీరానికి  మోక్షమార్గం త్వరగా లబిస్తుంది. 12 జ్యోతి లింగాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. దాదాపు నాలుగు వందల సంవత్సరాలుగా ఇది మంచుతో కప్పబడి ఉంది.

అయితే ఇక్కడ  ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఏంమిటంటే అంత మంచు తో ఉన్నపటికీ అక్కడ ఆ ఆలయం ఇసుమంత కూడా  చెక్కు చెదరలేదు. ఆ హిమాలయ పర్వతాల వద్ద మహానుభావుడు ఆ కేదారేశ్వరిలో ప్రతిరోజూ కూడా ఆ నారాయణులు ఒక పార్థివ లింగాన్ని అక్కడ ఉంచి ఆ పార్థివ లింగాన్ని ఆరాధన చేస్తూ ఉండేవారు.  వారు చేస్తున్నది పార్థివ లింగానికే పార్థివ లింగం అంటే మట్టితో చేసిన శివ లింగం కానీ వారు మేము  మట్టితో చేసిన శివలింగమే కదా అని తక్కువగా  అనుకునే వారు కాదు.

ఇదే ఈశ్వరుని ఈశ్వర స్వరూపం అని నమ్మారు. నమ్మి నర నారాయణులు అర్చనలు చేసేవారు.. అప్పుడు ఆ శివ లింగం నుండి  ఆ పరమశివుడు ఆవిర్భవించి  పరవశించిపోయి ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత ఖటోర తపస్సుతో ఆ పార్థివ లింగానికి  మీరు చేసిన పూజలకి నేను ఎంతో సంతోషించాను మీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అయితే అప్పుడు ఆ నర నారాయణులు ఇక్కడే  స్వయంభువు లింగ మూర్తిగా వెలసి లోకాలను కాపడమని కోరారు. వారి కోరిక మేరకు స్వామి అక్కడ వెలిశారు.

బృష్టా భాగం శివలింగం:-

అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికమైన దృశ్యం ఏమిటంటే ఇక్కడ ఉండే శివలింగం అన్ని శివలింగాల మాదిరి  కాదు చాలా ప్రత్యేకంగా వేరేగా అన్నిటి కన్నా బిన్నంగా ఉంటుంది. అయితే ఈ శివలింగం ఎద్దు వెనక భాగం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో లింగం మనకు  కనిపిస్తుంది. ఈ శివలింగం ఇలా ఎద్దు వెనక భాగం వాలె కనపడటానికి ఒక పురాణం కథనం ఉంది.

కురుక్షేత్రం తర్వాత పాండవులు వాళ్ళ బందుజనాన్ని హతమారుస్తారు ఆ పాపం నుంచి వారు బయట పడడానికి  కేదారేశ్వరుని దర్శించుకోవడనికి వెళ్లారు అప్పుడు శివుడు ఆ పాండవులను పరీక్షించడానికి ఒక చిన్న మహిషం (దున్నపోతు) రూపములో అటు వైపు పరిగెత్తారు అపుడు ఆ పాండవులు ఆ మహిషాన్ని అటు వైపు వెళ్ళడం గమనించారు.

ఇక్కడికి మహిషం ఎందుకు వచ్చింది. అది కచ్చితంగా ఆ పరమేశ్వరుడే అయి ఉంటాడు అని భావిస్తారు ఆ మహిషం కళ్ళు ఎలాగైనా పట్టుకోవాలి అని ఆ మహిషం వద్దకు వెళ్ళారు  అయితే వాళ్ళకి కళ్ళు మాత్రం అందలేదు తోక అందింది .

దాన్నే ఈశ్వర స్వరూపంగా భావించి తోక పట్టుకున్నారు పాండవులు. వాళ్ళ భక్తి కి మెచ్చిన పరమేశ్వరుడు తన బృష్ట భాగాన్ని అక్కడే విడిచి పెట్టి దానినే శివలింముగా మార్చేశాడట. అదే ఇప్పుడు మనం  దర్శించుకుంటున్న కేదారేశ్వరుని శివలింగం.

ప్రయాణ సౌకర్యాలు:-

Kedarnath yatra ఆ కేదరం వెళ్ళటానికి అక్కడి రోడ్డు కొన్ని కొన్ని నెలల్లోనే క్లియర్ చేస్తారు. ఇక్కడ రోజూ రాత్రుళ్లు 9 గం. కరెంట్ కొరత ఉంటుంది. ఇంకా ఆ కార్టేజ్స్ లో చీకట్లోనే నిద్రపోవాలి.  గౌరీకుండ్ నుండి కాలినడకతో  పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో కేదారనాధుని గుడి ప్రతిష్టింపబడి ఉంటుంది. గౌరీకుండ్ ఒకఅతి చిన్న ప్రాంతం సుమారు 20 నుంచి 30 ఇళ్లున్న ఈ ప్రాంతం Kedarnath yatra కు వెళ్లేందుకు బేస్ పాయింట్ గా ఉంటుంది.

వందకు కు మించి వాహనాలు కూడా నిలపలేని చిన్న ప్రాంతమిది. ఉదయాన్నే ఇక్కడున్న వాహనాలను వెనక్కు తిప్పి పంపిస్తారు. అంత సమయం వరకు ఇక్కడికి అటు నుంచి వచ్చే వాహనాలను అనుమతించరు. ఇక్కడకు ఎవ్వరూ నడిచి  వెళ్ళరు  ఎక్కడో ఒకరో ఇద్దరో ఈ ప్రాంతం గురించి తెలిసి ఉన్నవాళ్లు వెళ్తారేమో కానీ అంత సమయం వరకూ బయటనుంచి ఇతర వాహనాలను వేటినీ అనుమతించరు.

Kedarnath yatra చేసేవారికి గౌరీకుండ్ లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కౌంటర్ కూడా ఉంటుంది. ఇంకా అక్కడకు   వెళ్ళే వాళ్ళకి రెండు మార్గాలు ఉన్నాయి వాటిలో ఒకటి డోలిలలో వెళ్ళడం రెండు గుర్రాలపై వెళ్ళడం. డోలి లో కూడా అందరు వెళ్ళడానికి వీలుపడదు. అవి చాలా చిన్నగా సున్నితం గా ఉంటాయి.

వాటిపైన సన్నగా ఉన్నవాళ్లు మాత్రమె ఎక్కుతారు వాళ్ళకి మాత్రమే ఆగుతుంది ఆ డోలి. మిగితా వాళ్ళు అంతా గుర్రాల మీద వెళ్ళాల్సిందే.  ఇక్కడ గుర్రాలను కూడా  అద్దెకు తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి రూ.1100 చొప్పున తీసుకుంటారు. ముందుగానే డబ్బు చెల్లించి రసీదు తీసుకోవాలి. గుర్రం పై వెళ్ళడానికి ప్రయాణం సుమారు నాలుగు గంటలు వరకూ సమయం పడుతుంది.

ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే రెండు గుర్రాలనూ  ఒక్కడే నడుపుతాడు. ఈ గుర్రాల మీద నుండి వెళ్తుంటే గుర్రం తిరిగేటపపుడు కొండ అంచు దగ్గరకు వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆ గుర్రం కొద్దిగా కిందకు జారిందో అక్కడ వెతికే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు వెతికే సమస్య కూడా లేదు  ఎందుకంటే ఆ ప్రదేశం కొన్ని వేల అడుగుల నుండి కిందకు ఉంటుంది. 

ఇంత ఎత్తు నుంచి పడినవారు ఎవ్వరూ బ్రతకరు. కెదరం లో పడడం అంటే కైలాసం వెళ్ళాడు అంటారు. కాబట్టి ఆ కేదారం వెళ్ళేటపుడు పది రూ. ఇస్తే ఒక ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు disposable raincoat అది వేసుకొని ఆ గుర్రం వెక్కి వెళ్ళాలి .ఒక వైపు హోరున వర్షం కురుస్తుంది తడిచి ముద్ద అవుతాం అయినా ఎంత వాన కురిసినా దిగడానికి ఉండదు.

కేదరం వెళ్లి అక్కడి నుండి కిందికి దిగి వచ్చిన తర్వాత గుర్రం దిగిన వాడు నడుస్తుంటే అసలు వీడికి నడవడం వచ్చా అన్నటుగా అనిపిస్తుంది.  గోతుల రోడ్డులో  ఆ గుర్రం మీద కదలికకి వొల్లంతా పుండ్లు అయిపోయి పులిసిపోయి నొప్పులు చేసేస్తుంది.

గుర్రపు స్వారీ చేసేవారికి తప్ప మామూలు  వ్యక్తులెవ్వరికీ సాదారణంగా గుర్రం మీద ప్రయాణం అలవాటు ఉండదు కాబట్టి చాలా వరకూ ప్రయాణంలో కష్టపడాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో  కాళ్లు, వెన్నెముక విపరీతమైన నొప్పికి గురవుతాయి. ప్రయాణ సమయంలోనూ జాగ్రత్త వహించాలి. గుర్రం ద్వారా దాదాపు నాలుగు గంటల పాటు ప్రయాణం సాగుతుంది. 

ఓ వైపు పెద్ద పెద్ద లోయలుఉంటె ఇంకో వైపు  అడుగు వేస్తే జారిపోయే  అత్యంత ప్రమాదకరంగా సాగుతుంది. కానీ జీవితంలో కచ్చితంగా వెళ్ళాల్సిన యాత్ర . ఒక వైపు  కొన్ని వేల అడుగుల ఎత్తు అక్కడ మీరు పైనుండి కిందకు చూసారో కళ్ళు తిరుగినట్లు అనిపిస్తుంది . ఇటునుండి రుద్ర ప్రయోగ అటు నుండి దేవ ప్రయోగ రెండు వెళ్లి ఒక చోట కలుస్తాయి ఇక్కడ నుండి గంగా నది అక్కడ నుండి బదరీ లో అలకనంద నది రెండు ప్రవహిస్తూ ఉంటాయి.

ఆ నదుల చప్పుడులు పర్వతాల నుండి జలపాతాలు జారిపడుతూ ఉంటాయి వాటి చప్పుడు దడ్ దడ్ దడ్ మంటూ  వచ్చేసి చెవులకు జలపాతం వినసొంపుగా ఉంటాయి. అన్ని వేల అడుగులు అన్ని కొండలు  పైకి ఎక్కిన తర్వాత  ఆ స్వామి శిఖరం కనపడుతూ ఉంటుంది. పరుగు పరుగున లోపలికి వెళ్తే  లోపల పెద్ద అంతరాలయం అక్కడ కేదారేశ్వరుని గా వెలిశారు ఆ మహానుభావుడు పరమేశ్వరుడు.

అయితే Kedarnath లో ఉన్న ఆ మహా శివలింగ దర్శనం చేసుకునే వారికి మోక్షం కలుగుతుందాని  శివ మహా పురాణములో తెలపడం జరిగింది. ఆ ప్రాంతంలో అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోతే వారికి మోక్షం ప్రాప్తిస్తుందని శివ పురాణంలో చెప్పబడింది.

ప్రత్యక దర్శనం :-

ఇక్కడ ఆ కేదారేశ్వరుని దర్శనం సైతం ఒక పద్దతిలో చేసుకోవాలి అని చెప్తారు. కేదార లింగానికి ఎదుగా మనం చూడకుండా ఒక వలయంలో నుండి స్వామిని చూడాలని చెప్తారు. చేతికి వేసుకున్న కంకణం లాంటి ఒక గుండ్రటి రింగ్ లాంటి వస్తువు నుండి చూడాలని అక్కడి వారు చెప్తారు.

గర్భ గుడిలో కి ప్రవేశించిన వెంటనే కంటి ముందు ఆ వలయాన్ని పెట్టుకొని మొదటగా దానిలో నుండి స్వామిని దర్శించి ఆ తర్వాత మామూలుగా దర్శించుకోవాలి. ఇలా దర్శనం చేయడాన్ని అంతర ద్వార దర్సనం అంటారు  ఆ పరమేశ్వరున్ని దర్శించుకోవడం అని ప్రతీకగా తెలుపుతారు. అలా చూసిన కంకణాన్ని ఆ ప్రాంతంలోనే వదిలి పెట్టి వచ్చేయాలి అని చెప్తారు.

ఆ కేదారేశ్వరుని లింగానికి కొద్దిగా నెయ్యి రాసి మొక్కుకుంటే వాళ్ళు చేసిన పాపాలు పోయి కోరికలు తీరతాయి అని వాళ్ళ నమ్మకం. కేదారేశ్వరుని మహత్యం గురించి చెప్తూ ఈ విషయాన్ని స్వయంగా ఆ పరమేశ్వరుడే ఒకసారి పార్వతి దేవికి చెప్పాడట. అలా శివ లింగానికి నెయ్యి రాసి కోరికలని కోరడానికి ఒక పురాణ కథనం కూడా ఉంది.

ద్వాపర యుగంలో పాండవులు మహిషం రూపంలో ఉన్న శివుని వెనకేటప్పుడు వారు తోక పట్టుకుని లాగడంతో బృష్ఠ భాగం అంతా కమిలి పోయిందట. అప్పుడు ఆ కమిలి పోయిన బృష్ఠా భాగానికి కొద్దిగా నెయ్యి రాసి సేద తీర్చారని శాస్త్రాల్లో పేర్కొనబడినది.

అందుకే స్వామికి నెయ్యి రాసి నేతితో అభిషేకం చేయడం ఆనవాయితీగా మారింది. ఆ విధంగా అభిషేకం చేసిన నెయ్యిని ప్రసాదం గా ఇంటికి తెచ్చుకుంటే ఇంటికి శుభం కలుగుతుంది అని చెప్తారు. మన శరీరంలో ఎలాంటి నొప్పులు ఉన్న అక్కడ ఆ నెయ్యిని రాస్తే ఆనొప్పి నుండి త్వరగా విముక్తి కలుగుతుంది.

Kedarnath గుడి అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రం. ఇది గర్హ్వాల్ కొండల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ మొదలుకొని దీపావళి వరకూ భక్తుల సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. ఆ తర్వాత ఆరు నెలల పాటు మూసి ఉంచుతారు. ఆ సమయంలో దేవతలు ఆ కేదారేశ్వరుని పూజిస్తారు.

వాతావరణ మార్పు మరియు అత్యంత మంచు కారణంగా శీతాకాలంలో Kedarnath ఆలయం మూసి వేయబడుతుంది. ఆరు నెలలు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు Kedarnath యొక్క ఉత్సవ మూర్తి (విగ్రహం) తో ఉన్న పాల్కీని గుప్తాకాషికి సమీపంలో ఉన్న ఉఖిమత్ అనే ఒక  ప్రదేశానికి తీసుకువస్తారు.

పూజారులు మరియు ఇతర వేసవి కాల నివాసితులు కూడా తమ ఇళ్లను సమీప గ్రామాలకు తరలిస్తారు. 55 గ్రామాలు మరియు సమీపంలోని ఇతర గ్రామాలకు చెందిన తీర్థ పురోహిత్ యొక్క 360 కుటుంబాలు జీవనోపాధి కోసం కేదార్‌నాథ్‌పై ఆధారపడి ఉన్నాయి.

Read Also..Dakshinamurthy Stotram | అంతులేని సంపదనిచ్చే దక్షిణామూర్తి స్తోత్రం

 

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular